BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

పుంగనూరులో 14 ఏళ్ల బాలికపై దారుణం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
05 Apr, 2026 - 04:49 AM
107 వీక్షణలు

పుంగనూరులో 14 ఏళ్ల బాలికపై దారుణం – నిందితుడికి కఠిన శిక్ష కోరుతూ కుటుంబ సభ్యుల ఆవేదన

అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం నల్లగుట్లపల్లి తాండలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అదే ప్రాంతానికి చెందిన రాంబాబు (35) తనకు వరుసకు చిన్నాయన అయిన 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సమాచారం ప్రకారం, రాంబాబు బాలికతో కలిసి ప్రభుత్వ ఎఫ్‌సి షాపులో బియ్యం తీసుకుని ఆటోలో తిరిగి వస్తున్న సమయంలో మార్గమధ్యంలో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసింది. అనంతరం బాలికను గ్రామంలో దింపి, అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.

గ్రామానికి చేరుకున్న బాలిక ఏడుస్తూ జరిగిన ఘటనను తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో బాలిక తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

“మా బిడ్డ జీవితం పాడు చేసిన రాంబాబుకు ఉరి శిక్ష విధించాలి. మా కూతురికి న్యాయం చేయాలి” అని బాధితురాలి తల్లి వేడుకుంటోంది.

ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పుంగనూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు.