పుంగనూరులో 14 ఏళ్ల బాలికపై దారుణం
పుంగనూరులో 14 ఏళ్ల బాలికపై దారుణం – నిందితుడికి కఠిన శిక్ష కోరుతూ కుటుంబ సభ్యుల ఆవేదన
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం నల్లగుట్లపల్లి తాండలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అదే ప్రాంతానికి చెందిన రాంబాబు (35) తనకు వరుసకు చిన్నాయన అయిన 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సమాచారం ప్రకారం, రాంబాబు బాలికతో కలిసి ప్రభుత్వ ఎఫ్సి షాపులో బియ్యం తీసుకుని ఆటోలో తిరిగి వస్తున్న సమయంలో మార్గమధ్యంలో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసింది. అనంతరం బాలికను గ్రామంలో దింపి, అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.
గ్రామానికి చేరుకున్న బాలిక ఏడుస్తూ జరిగిన ఘటనను తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో బాలిక తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
“మా బిడ్డ జీవితం పాడు చేసిన రాంబాబుకు ఉరి శిక్ష విధించాలి. మా కూతురికి న్యాయం చేయాలి” అని బాధితురాలి తల్లి వేడుకుంటోంది.
ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పుంగనూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.
ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు.