BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

పుంగనూరులో 14 ఏళ్ల బాలికపై దారుణం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
05 Apr, 2026 - 04:49 AM
67 వీక్షణలు

పుంగనూరులో 14 ఏళ్ల బాలికపై దారుణం – నిందితుడికి కఠిన శిక్ష కోరుతూ కుటుంబ సభ్యుల ఆవేదన

అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం నల్లగుట్లపల్లి తాండలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అదే ప్రాంతానికి చెందిన రాంబాబు (35) తనకు వరుసకు చిన్నాయన అయిన 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సమాచారం ప్రకారం, రాంబాబు బాలికతో కలిసి ప్రభుత్వ ఎఫ్‌సి షాపులో బియ్యం తీసుకుని ఆటోలో తిరిగి వస్తున్న సమయంలో మార్గమధ్యంలో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసింది. అనంతరం బాలికను గ్రామంలో దింపి, అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.

గ్రామానికి చేరుకున్న బాలిక ఏడుస్తూ జరిగిన ఘటనను తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో బాలిక తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

“మా బిడ్డ జీవితం పాడు చేసిన రాంబాబుకు ఉరి శిక్ష విధించాలి. మా కూతురికి న్యాయం చేయాలి” అని బాధితురాలి తల్లి వేడుకుంటోంది.

ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పుంగనూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు.