కొత్త ఓటర్ల నమోదుకు శ్రీకారం
కొత్త ఓటర్ల నమోదుకు శ్రీకారం 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి
18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అర్హులైన యువత ఓటరుగా నమోదు చేసుకునేందుకు ప్రక్రియ ప్రారంభమైంది. 01 అక్టోబర్ 2008 లేదా అంతకు ముందు జన్మించిన వారు కొత్త ఓటరు నమోదుకు అర్హులు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో కీలకమని, ప్రతి అర్హుడు తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఓటరు నమోదుకు ఆధార్ కార్డు, జనన ధృవీకరణ పత్రం లేదా పదో తరగతి మెమో లేదా బదిలీ ధృవీకరణ పత్రం, రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు, కుటుంబ సభ్యుల్లో ఒకరి ఓటరు గుర్తింపు కార్డు, మొబైల్ నంబర్ అవసరం ఉంటుంది. అర్హత కలిగిన వారు గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాలు లేదా ఎన్వీఎస్పీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
మీ ఓటు - మీ హక్కు... ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులు కోరారు.