BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

క్రమశిక్షణతో చదివితేనే విజయపథం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Mar, 2026 - 09:44 PM
70 వీక్షణలు

క్రమశిక్షణతో చదివితేనే విజయపథం: విశ్రాంత ప్రొఫెసర్ నాగేశ్వరరావ

విద్యార్థులు చిన్నప్పటి నుంచే క్రమశిక్షణతో చదువుకుంటే జీవితంలో మంచి ఫలితాలు సాధించగలరని ఉస్మానియా యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ రామాల నాగేశ్వరరావు తెలిపారు.

శుక్రవారం గంపలగూడెం మండలం పెనుగొలను ప్రాథమిక మెయిన్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ‘విద్యార్థుల క్రమశిక్షణ’ అనే అంశంపై ప్రసంగించారు. చదువుతో పాటు మంచి అలవాట్లు, సమయపాలన, క్రమశిక్షణ విద్యార్థుల భవిష్యత్తును నిర్మిస్తాయని ఆయన సూచించారు.

ఈ సందర్భంగా, జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు సోదరి కోటమ్మ పాఠశాలకు రూ.33 వేల విలువైన మైక్ సెట్, సౌండ్ బాక్స్‌లను అందజేసినట్లు ప్రధానోపాధ్యాయుడు యోహాను తెలిపారు.

కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం ప్రొఫెసర్ నాగేశ్వరరావును శాలువా కప్పి ఘనంగా సన్మానించింది.

ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెచ్‌ఎం దుర్గాప్రసాద్, విశ్రాంత ఎంఈఓ శేషిరెడ్డి, నంబూరి శ్రీనివాసరావు, తొండెపు నాగేశ్వరరావు, వూటుకూరు నారాయణరావు, దేవరపల్లి రమేష్, ఆదూరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.