క్రమశిక్షణతో చదివితేనే విజయపథం
క్రమశిక్షణతో చదివితేనే విజయపథం: విశ్రాంత ప్రొఫెసర్ నాగేశ్వరరావ
విద్యార్థులు చిన్నప్పటి నుంచే క్రమశిక్షణతో చదువుకుంటే జీవితంలో మంచి ఫలితాలు సాధించగలరని ఉస్మానియా యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ రామాల నాగేశ్వరరావు తెలిపారు.
శుక్రవారం గంపలగూడెం మండలం పెనుగొలను ప్రాథమిక మెయిన్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ‘విద్యార్థుల క్రమశిక్షణ’ అనే అంశంపై ప్రసంగించారు. చదువుతో పాటు మంచి అలవాట్లు, సమయపాలన, క్రమశిక్షణ విద్యార్థుల భవిష్యత్తును నిర్మిస్తాయని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా, జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు సోదరి కోటమ్మ పాఠశాలకు రూ.33 వేల విలువైన మైక్ సెట్, సౌండ్ బాక్స్లను అందజేసినట్లు ప్రధానోపాధ్యాయుడు యోహాను తెలిపారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం ప్రొఫెసర్ నాగేశ్వరరావును శాలువా కప్పి ఘనంగా సన్మానించింది.
ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం దుర్గాప్రసాద్, విశ్రాంత ఎంఈఓ శేషిరెడ్డి, నంబూరి శ్రీనివాసరావు, తొండెపు నాగేశ్వరరావు, వూటుకూరు నారాయణరావు, దేవరపల్లి రమేష్, ఆదూరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.