BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 27 March 2026, 11:09 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కుళ్లిన చికెన్ స్వాధీనం – నిందితుడి అరెస్ట్

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Mar, 2026 - 11:09 PM
148 వీక్షణలు

కుళ్లిన చికెన్ స్వాధీనం – నిందితుడి అరెస్ట్

హైదరాబాద్, మార్చి 27: నగరంలోని మూసాపేట పరిధి భరత్‌నగర్‌లో ఆహార భద్రతా విభాగం, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో భారీగా కుళ్లిన చికెన్ బయటపడింది. ఈ సందర్భంగా సూరజ్ పాల్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుండి సుమారు 352 కిలోల పాడైన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అధికారుల వివరాల ప్రకారం, నిందితుడు ఈ మాంసాన్ని అపరిశుభ్ర పరిస్థితుల్లో నిల్వ ఉంచి, స్థానిక హోటళ్లు మరియు చికెన్ విక్రేతలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. వినియోగానికి అనర్హమైన ఈ మాంసం వల్ల ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

దర్యాప్తులో భాగంగా, నిందితుడి వద్ద ఉన్న ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ గడువు కూడా ముగిసినట్లు వెల్లడైంది. ఘటనపై కేసు నమోదు చేసి మరింత విచారణ కొనసాగిస్తున్నారు. అధికారులు ప్రజలు మాంసం కొనుగోలు సమయంలో నాణ్యత, పరిశుభ్రతపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.