BREAKING
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి
www.ntodaynews.com

కుళ్లిన చికెన్ స్వాధీనం – నిందితుడి అరెస్ట్

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Mar, 2026 - 11:09 PM
48 వీక్షణలు

కుళ్లిన చికెన్ స్వాధీనం – నిందితుడి అరెస్ట్

హైదరాబాద్, మార్చి 27: నగరంలోని మూసాపేట పరిధి భరత్‌నగర్‌లో ఆహార భద్రతా విభాగం, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో భారీగా కుళ్లిన చికెన్ బయటపడింది. ఈ సందర్భంగా సూరజ్ పాల్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుండి సుమారు 352 కిలోల పాడైన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అధికారుల వివరాల ప్రకారం, నిందితుడు ఈ మాంసాన్ని అపరిశుభ్ర పరిస్థితుల్లో నిల్వ ఉంచి, స్థానిక హోటళ్లు మరియు చికెన్ విక్రేతలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. వినియోగానికి అనర్హమైన ఈ మాంసం వల్ల ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

దర్యాప్తులో భాగంగా, నిందితుడి వద్ద ఉన్న ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ గడువు కూడా ముగిసినట్లు వెల్లడైంది. ఘటనపై కేసు నమోదు చేసి మరింత విచారణ కొనసాగిస్తున్నారు. అధికారులు ప్రజలు మాంసం కొనుగోలు సమయంలో నాణ్యత, పరిశుభ్రతపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.