BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

కుళ్లిన చికెన్ స్వాధీనం – నిందితుడి అరెస్ట్

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Mar, 2026 - 11:09 PM
72 వీక్షణలు

కుళ్లిన చికెన్ స్వాధీనం – నిందితుడి అరెస్ట్

హైదరాబాద్, మార్చి 27: నగరంలోని మూసాపేట పరిధి భరత్‌నగర్‌లో ఆహార భద్రతా విభాగం, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో భారీగా కుళ్లిన చికెన్ బయటపడింది. ఈ సందర్భంగా సూరజ్ పాల్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుండి సుమారు 352 కిలోల పాడైన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అధికారుల వివరాల ప్రకారం, నిందితుడు ఈ మాంసాన్ని అపరిశుభ్ర పరిస్థితుల్లో నిల్వ ఉంచి, స్థానిక హోటళ్లు మరియు చికెన్ విక్రేతలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. వినియోగానికి అనర్హమైన ఈ మాంసం వల్ల ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

దర్యాప్తులో భాగంగా, నిందితుడి వద్ద ఉన్న ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ గడువు కూడా ముగిసినట్లు వెల్లడైంది. ఘటనపై కేసు నమోదు చేసి మరింత విచారణ కొనసాగిస్తున్నారు. అధికారులు ప్రజలు మాంసం కొనుగోలు సమయంలో నాణ్యత, పరిశుభ్రతపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.