www.ntodaynews.com
కుంటముక్కలలో ఐ.ఎం.ఎల్ పాలీ కంటైనర్స్ ఫ్యాక్టరీ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
కుంటముక్కలలో ఐ.ఎం.ఎల్ పాలీ కంటైనర్స్ ఫ్యాక్టరీ ప్రారంభం
ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు, 29.03.2026.
జి.కొండూరు మండలంలోని కుంటముక్కల గ్రామంలో ఐ.ఎం.ఎల్ పాలీ కంటైనర్స్ ఫ్యాక్టరీని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ఆదివారం ప్రారంభించారు. వివిధ పాల ఉత్పత్తులను ప్యాకింగ్ చేసేందుకు అవసరమైన ప్లాస్టిక్ కంటైనర్ల తయారీ ఈ ఫ్యాక్టరీలో చేపట్టనున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.