www.ntodaynews.com
కుప్పంలో నాలుగు రోజుల పర్యటనకు నారా భువనేశ్వరి
ఆంధ్రప్రదేశ్
/
చిత్తూరు
కుప్పంలో నాలుగు రోజుల పర్యటనకు నారా భువనేశ్వరి
కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనకు నారా భువనేశ్వరి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో నిన్న బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు కుప్పం నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో కుప్పం చేరుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన నారా భువనేశ్వరి, నాలుగు రోజుల పాటు కుప్పం ప్రజలతో పూర్తిగా మమేకం అవ్వబోతున్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.