BREAKING
ప్రైవేటు వ్యక్తుల చేతిలో బిఎల్వోల లాగిన్ భవానిపురం , క్రాంబ్వే రోడ్డు లోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తా భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ప్రైవేటు వ్యక్తుల చేతిలో బిఎల్వోల లాగిన్ భవానిపురం , క్రాంబ్వే రోడ్డు లోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తా భర్తతో విభేదాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిన మహిళ.. ఆచూకీ కోసం పోలీసులు వెతుకులాట ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు
www.ntodaynews.com

కేజీబీవీ బాలికలను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలి

తెలంగాణ
09 Jan, 2026 - 11:33 PM
75 వీక్షణలు
కేజీబీవీ బాలికలను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలి: అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే NTODAY NEWS: కరీంనగర్  కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదువుతున్న బాలికలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేలా తీర్చిదిద్దాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (NIEPA), న్యూఢిల్లీ సహకారంతో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల ప్రత్యేక అధికారులు, వార్డెన్లకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఈ శిక్షణ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని కేజీబీవీల్లో చదువుతున్న బాలికలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. బాలికలను విద్యావంతులుగా తీర్చిదిద్దడంతో పాటు, తమ కాళ్ల మీద తాము నిలబడేలా ప్రోత్సహించాలని తెలిపారు. కేజీబీవీ బాలికలను అన్ని రంగాల్లో రాణించేలా తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారులకు బ్యాగులను బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో శిక్షణ డైరెక్టర్ డాక్టర్ దేబోర కృపారాణి, యాదాద్రి జిల్లా మాస్టర్ ట్రైనర్లు పగిడిపల్లి నిర్మల, జ్యోతి, కరీంనగర్–జయశంకర్ భూపాలపల్లి జిల్లాల కేజీబీవీ ప్రత్యేక అధికారులు, వార్డెన్లు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube