BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

లేడీ పోలీస్ ముసుగులో భారీ చీటింగ్ – చెన్నైలో వెలుగులోకి షాకింగ్ స్కామ్

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Jun, 2026 - 06:09 AM
24 వీక్షణలు

సమాజంలో నేరం జరిగితే ప్రజలు ముందుగా ఆశ్రయించేది పోలీస్ స్టేషన్. ఖాకీ చొక్కాపై ఉన్న నమ్మకమే వారికి భరోసా. కానీ అదే ఖాకీ ముసుగులో మోసం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో చూపిన ఘటన చెన్నైలో వెలుగుచూసింది.

చెన్నై రాయపురం మహిళా పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న షీలా మేరీ అనే మహిళా అధికారి తన బంధువు ప్రభుమణితో కలిసి భారీ పెట్టుబడి మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

2023 నుంచి 2024 మధ్యకాలంలో వీరిద్దరూ “బంగారంపై పెట్టుబడి పెడితే తక్కువ ధరకే నాణేలు ఇస్తాం, మార్కెట్ కంటే ఎక్కువ లాభాలు వస్తాయి” అంటూ ఒక స్కీమ్‌ను ప్రచారం చేసినట్లు సమాచారం. నమ్మకం కలిగించేందుకు అధికారిక పోలీస్ వాహనాన్ని కూడా ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఎన్నికల సమయంలో అదే పోలీస్ వాహనంలో బంగారు నాణేలు పంపిణీ చేయడంతో ప్రజలు మరింతగా నమ్మి పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నమ్మకాన్ని ఆధారంగా చేసుకుని సుమారు 200 మందికి పైగా వ్యక్తులు దాదాపు రూ.20 కోట్ల వరకు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం.

తర్వాత ఈ వ్యవహారం బయటపడటంతో ప్రభుమణిని అధికారులు అరెస్ట్ చేయగా, ఇన్‌స్పెక్టర్ షీలా మేరీపై కూడా కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం ఈ ఆర్థిక మోసం కేసుపై ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు కొనసాగిస్తోంది.