BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

లేడీ పోలీస్ ముసుగులో భారీ చీటింగ్ – చెన్నైలో వెలుగులోకి షాకింగ్ స్కామ్

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Jun, 2026 - 06:09 AM
116 వీక్షణలు

సమాజంలో నేరం జరిగితే ప్రజలు ముందుగా ఆశ్రయించేది పోలీస్ స్టేషన్. ఖాకీ చొక్కాపై ఉన్న నమ్మకమే వారికి భరోసా. కానీ అదే ఖాకీ ముసుగులో మోసం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో చూపిన ఘటన చెన్నైలో వెలుగుచూసింది.

చెన్నై రాయపురం మహిళా పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న షీలా మేరీ అనే మహిళా అధికారి తన బంధువు ప్రభుమణితో కలిసి భారీ పెట్టుబడి మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

2023 నుంచి 2024 మధ్యకాలంలో వీరిద్దరూ “బంగారంపై పెట్టుబడి పెడితే తక్కువ ధరకే నాణేలు ఇస్తాం, మార్కెట్ కంటే ఎక్కువ లాభాలు వస్తాయి” అంటూ ఒక స్కీమ్‌ను ప్రచారం చేసినట్లు సమాచారం. నమ్మకం కలిగించేందుకు అధికారిక పోలీస్ వాహనాన్ని కూడా ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఎన్నికల సమయంలో అదే పోలీస్ వాహనంలో బంగారు నాణేలు పంపిణీ చేయడంతో ప్రజలు మరింతగా నమ్మి పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నమ్మకాన్ని ఆధారంగా చేసుకుని సుమారు 200 మందికి పైగా వ్యక్తులు దాదాపు రూ.20 కోట్ల వరకు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం.

తర్వాత ఈ వ్యవహారం బయటపడటంతో ప్రభుమణిని అధికారులు అరెస్ట్ చేయగా, ఇన్‌స్పెక్టర్ షీలా మేరీపై కూడా కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం ఈ ఆర్థిక మోసం కేసుపై ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు కొనసాగిస్తోంది.