www.ntodaynews.com
లింగపాలెం మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడిగా ఎస్.కె. అబ్దుల్ రహమాన్ ఏకగ్రీవ ఎన్నిక
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా లింగపాలెం మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడిగా ఎస్.కె. అబ్దుల్ రహమాన్ (కాకాని) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల ఎంపీటీసీ సభ్యులు గురువారం చేతులు ఎత్తే విధానంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారి ఎం. రాజు, ఎంపీడీఓ కె. వాణి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరిగింది. సభ్యుల సమ్మతితో ఎన్నిక పూర్తయింది.
తదుపరి, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ కో-ఆప్షన్ సభ్యుడిగా నియమితులైన అబ్దుల్ రహమాన్కు నియామక పత్రాలు అందజేశారు.