లింక్ ఓపెన్ చేస్తే రూ.12 లక్షలు మాయం
లింక్ ఓపెన్ చేస్తే రూ.12 లక్షలు మాయం పోలవరం ఎమ్మెల్యా ఖాతాలో సైబర్ మోసం
పోలవరం ఎమ్మెల్యా చిర్రి బాలరాజు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.12 లక్షలు మాయం చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై సంబంధిత పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జంగారెడ్డిగూడెంలోని ఇండస్ లాండ్ బ్యాంకులో ఎమ్మెల్యాకు ఖాతా ఉంది. ఆ ఖాతాకు ఫోన్ నెంబర్ లింక్ కాలేదని పేర్కొంటూ ‘ఆర్టీఏ చలానా’ పేరుతో ఒక యాప్ లింక్ ఆయన మొబైల్కు వచ్చింది.
ఆ లింక్ను ఎమ్మెల్యా ఓపెన్ చేసిన వెంటనే ఖాతాలోని రూ.12 లక్షలు మాయమైనట్లు తెలిసింది. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు.
జాగ్రత్త: తెలియని లింక్లు ఓపెన్ చేయకండి… బ్యాంకింగ్ వివరాలు ఎవరికీ పంచుకోవద్దు.