BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

లక్షద్వీప్‌కు చేరుకున్న నైరుతి రుతుపవనాలు: ఐఎండీ

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 May, 2026 - 03:53 PM
121 వీక్షణలు

లక్షద్వీప్‌కు చేరుకున్న నైరుతి రుతుపవనాలు: ఐఎండీ

దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ప్రస్తుతం ఇవి ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్‌తో పాటు బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని అధికారులు తెలిపారు.

మే 26నే కేరళ తీరాన్ని తాకాల్సి ఉన్నప్పటికీ, స్వల్ప ఆలస్యంతో రుతుపవనాల ప్రవేశం జరుగుతోందన్నారు. సాధారణంగా జూన్ 1న కేరళను చేరుకునే నైరుతి రుతుపవనాలు, ఆ తర్వాత వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

రుతుపవనాల ప్రభావంతో రాబోయే రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.