www.ntodaynews.com
లక్షద్వీప్కు చేరుకున్న నైరుతి రుతుపవనాలు: ఐఎండీ
జాతీయం
లక్షద్వీప్కు చేరుకున్న నైరుతి రుతుపవనాలు: ఐఎండీ
దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ప్రస్తుతం ఇవి ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్తో పాటు బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని అధికారులు తెలిపారు.
మే 26నే కేరళ తీరాన్ని తాకాల్సి ఉన్నప్పటికీ, స్వల్ప ఆలస్యంతో రుతుపవనాల ప్రవేశం జరుగుతోందన్నారు. సాధారణంగా జూన్ 1న కేరళను చేరుకునే నైరుతి రుతుపవనాలు, ఆ తర్వాత వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
రుతుపవనాల ప్రభావంతో రాబోయే రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.