BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

లక్ష్యాన్ని దాటిన వసూళ్లు...

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Apr, 2026 - 06:34 PM
101 వీక్షణలు

లక్ష్యాన్ని దాటిన వసూళ్లు.. చింతలపూడి మార్కెట్ కమిటీకి ఎమ్మెల్యే ప్రశంసలు

ఏలూరు జిల్లా చింతలపూడి మార్కెట్ కమిటీ లక్ష్యాన్ని మించి మార్కెట్ ఫీజు వసూలు చేసి జిల్లాలో అగ్రస్థానాన్ని నిలుపుకోవడంపై ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాలకవర్గాన్ని అభినందించారు.

సోమవారం స్థానిక మార్కెట్ కమిటీ ఆవరణలో నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో గౌరవాధ్యక్షునిగా ఎమ్మెల్యే  సొంగా రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటి మూడు స్థానాల్లో చింతలపూడి మార్కెట్ కమిటీ నిలవాలని, ఆ దిశగా పాలకవర్గ సభ్యులు మరింత కృషి చేయాలని సూచించారు.

రాష్ట్రంలోని పెద్ద మార్కెట్ కమిటీల పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించి, చింతలపూడి కమిటీ ఆదాయాన్ని ఇంకా పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ దుర్గా పార్వతి మధు బాబు మాట్లాడుతూ, ఏడు చెక్‌పోస్టుల ద్వారా రూ.5.30 కోట్లు, కార్యాలయం ద్వారా రూ.3 కోట్లు కలిపి మొత్తం రూ.8.5 కోట్ల మార్కెట్ ఫీజు వసూలు చేసినట్లు తెలిపారు.

ఈ సమావేశంలో వైస్ చైర్మన్‌తో పాటు మార్కెటింగ్ డైరెక్టర్ మరియు ఇతర పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.