BREAKING
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి
www.ntodaynews.com

లక్ష్యాన్ని దాటిన వసూళ్లు...

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Apr, 2026 - 06:34 PM
66 వీక్షణలు

లక్ష్యాన్ని దాటిన వసూళ్లు.. చింతలపూడి మార్కెట్ కమిటీకి ఎమ్మెల్యే ప్రశంసలు

ఏలూరు జిల్లా చింతలపూడి మార్కెట్ కమిటీ లక్ష్యాన్ని మించి మార్కెట్ ఫీజు వసూలు చేసి జిల్లాలో అగ్రస్థానాన్ని నిలుపుకోవడంపై ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాలకవర్గాన్ని అభినందించారు.

సోమవారం స్థానిక మార్కెట్ కమిటీ ఆవరణలో నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో గౌరవాధ్యక్షునిగా ఎమ్మెల్యే  సొంగా రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటి మూడు స్థానాల్లో చింతలపూడి మార్కెట్ కమిటీ నిలవాలని, ఆ దిశగా పాలకవర్గ సభ్యులు మరింత కృషి చేయాలని సూచించారు.

రాష్ట్రంలోని పెద్ద మార్కెట్ కమిటీల పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించి, చింతలపూడి కమిటీ ఆదాయాన్ని ఇంకా పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ దుర్గా పార్వతి మధు బాబు మాట్లాడుతూ, ఏడు చెక్‌పోస్టుల ద్వారా రూ.5.30 కోట్లు, కార్యాలయం ద్వారా రూ.3 కోట్లు కలిపి మొత్తం రూ.8.5 కోట్ల మార్కెట్ ఫీజు వసూలు చేసినట్లు తెలిపారు.

ఈ సమావేశంలో వైస్ చైర్మన్‌తో పాటు మార్కెటింగ్ డైరెక్టర్ మరియు ఇతర పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.