లోకాయుక్తలో ఫిర్యాదు, రేపు విచారణ
యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, నాగినేనిపల్లి గ్రామ రెవిన్యూ పరిధిలో గల పట్టా భూములు,ప్రభుత్వ భూములు,లావనీ పట్టా భూముల విషయంలో భారీగా అవకతవకలు జరిగాయని ఇట్టి విషయంలో భూముల పై విచారణ జరపాలని జిల్లా,మండల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని బొమ్మలరామారం మండల సామాజిక కార్యకర్త తెలిపారు ఇచ్చిన ఫిర్యాదు పై ఎలాంటి విచారణ జరపకపోవడంతో లోకయుక్త ను ఆశ్రయించడం జరిగిందన్నారు రాష్ట్ర ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి (చీప్ సెక్రెటరి), HMDA కమిషనర్, DIG రిజిస్టేషన్ & స్టాంప్స్ (మేడ్చల్ మల్కాజ్ గిరి) హైద్రాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, నల్గొండ జిల్లా-రిజిస్ట్రార్, యాదాద్రి జిల్లా పంచాయితి అధికారి (DPO), జిల్లా పంచాయతి సహయ అదికారి (DLPO), సబ్ రిజిస్ట్రార్ భువనగిరి, సబ్-రిజిస్ట్రార్ యాదగిరిగుట్ట,తహసిల్దార్ బొమ్మలరామారం, మండల పంచాయతి అదికారి (MPO), పంచాయతీ కార్యదర్శి నాగినేనిపల్లి గార్లపై విచారణ జరిపి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని లోకాయుక్తలో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు