మైదానంలో క్రికెట్.. మార్కెట్లో ముఖాముఖి: మంచిర్యాల ప్రజలతో మమేకమైన పెద్దపల్లి ఎంపీ
పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ గడ్డం వంశీకృష్ణ ఆదివారం మంచిర్యాల పట్టణంలో విస్తృతంగా పర్యటించి ప్రజలు, యువత, వ్యాపారులతో మమేకమయ్యారు. ఉదయం హైటెక్ సిటీలో యువతతో బ్యాడ్మింటన్, బాయ్స్ గ్రౌండ్లో చిన్నారులతో క్రికెట్ ఆడి క్రీడల ప్రాముఖ్యతను వివరించిన ఆయన, మైదాన అభివృద్ధికి అవసరమైన 20 ట్రిప్పుల మట్టిని వెంటనే ఏర్పాటు చేయాలని శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్ను ఫోన్లో కోరడంతో పాటు చిన్నారులకు రెండు క్రికెట్ కిట్లు అందజేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మార్కెట్ ప్రాంతంలోని రత్నలాల్ హోటల్ వద్ద స్థానికులు, వ్యాపారులతో సమావేశమై డ్రైనేజీ, రోడ్లు, పార్కింగ్, తాగునీరు, వాణిజ్య గ్యాస్ సరఫరా తదితర సమస్యలను అడిగి తెలుసుకొని, వాటి తక్షణ పరిష్కారానికి అధికారులకు తగిన సూచనలు చేశారు. "ప్రజల సమస్యలే నా సమస్యలని, వారి మధ్యే ఉంటూ పరిష్కారానికి కృషి చేయడమే నా బాధ్యత" అని ఎంపీ స్పష్టం చేసిన ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, క్రీడాకారులు, వ్యాపారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు