BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

​మైదానంలో క్రికెట్.. మార్కెట్లో ముఖాముఖి: మంచిర్యాల ప్రజలతో మమేకమైన పెద్దపల్లి ఎంపీ

తెలంగాణ
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
14 Jun, 2026 - 11:12 AM
154 వీక్షణలు

పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ గడ్డం వంశీకృష్ణ ఆదివారం మంచిర్యాల పట్టణంలో విస్తృతంగా పర్యటించి ప్రజలు, యువత, వ్యాపారులతో మమేకమయ్యారు. ఉదయం హైటెక్ సిటీలో యువతతో బ్యాడ్మింటన్, బాయ్స్ గ్రౌండ్‌లో చిన్నారులతో క్రికెట్ ఆడి క్రీడల ప్రాముఖ్యతను వివరించిన ఆయన, మైదాన అభివృద్ధికి అవసరమైన 20 ట్రిప్పుల మట్టిని వెంటనే ఏర్పాటు చేయాలని శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్‌ను ఫోన్లో కోరడంతో పాటు చిన్నారులకు రెండు క్రికెట్ కిట్లు అందజేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మార్కెట్ ప్రాంతంలోని రత్నలాల్ హోటల్ వద్ద స్థానికులు, వ్యాపారులతో సమావేశమై డ్రైనేజీ, రోడ్లు, పార్కింగ్, తాగునీరు, వాణిజ్య గ్యాస్ సరఫరా తదితర సమస్యలను అడిగి తెలుసుకొని, వాటి తక్షణ పరిష్కారానికి అధికారులకు తగిన సూచనలు చేశారు. "ప్రజల సమస్యలే నా సమస్యలని, వారి మధ్యే ఉంటూ పరిష్కారానికి కృషి చేయడమే నా బాధ్యత" అని ఎంపీ స్పష్టం చేసిన ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, క్రీడాకారులు, వ్యాపారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు