BREAKING
పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు.
www.ntodaynews.com

​మైదానంలో క్రికెట్.. మార్కెట్లో ముఖాముఖి: మంచిర్యాల ప్రజలతో మమేకమైన పెద్దపల్లి ఎంపీ

తెలంగాణ
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
14 Jun, 2026 - 11:12 AM
70 వీక్షణలు

పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ గడ్డం వంశీకృష్ణ ఆదివారం మంచిర్యాల పట్టణంలో విస్తృతంగా పర్యటించి ప్రజలు, యువత, వ్యాపారులతో మమేకమయ్యారు. ఉదయం హైటెక్ సిటీలో యువతతో బ్యాడ్మింటన్, బాయ్స్ గ్రౌండ్‌లో చిన్నారులతో క్రికెట్ ఆడి క్రీడల ప్రాముఖ్యతను వివరించిన ఆయన, మైదాన అభివృద్ధికి అవసరమైన 20 ట్రిప్పుల మట్టిని వెంటనే ఏర్పాటు చేయాలని శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్‌ను ఫోన్లో కోరడంతో పాటు చిన్నారులకు రెండు క్రికెట్ కిట్లు అందజేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మార్కెట్ ప్రాంతంలోని రత్నలాల్ హోటల్ వద్ద స్థానికులు, వ్యాపారులతో సమావేశమై డ్రైనేజీ, రోడ్లు, పార్కింగ్, తాగునీరు, వాణిజ్య గ్యాస్ సరఫరా తదితర సమస్యలను అడిగి తెలుసుకొని, వాటి తక్షణ పరిష్కారానికి అధికారులకు తగిన సూచనలు చేశారు. "ప్రజల సమస్యలే నా సమస్యలని, వారి మధ్యే ఉంటూ పరిష్కారానికి కృషి చేయడమే నా బాధ్యత" అని ఎంపీ స్పష్టం చేసిన ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, క్రీడాకారులు, వ్యాపారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు