www.ntodaynews.com
లయన్స్ క్లబ్కు 25 లక్షల విలువైన స్థలం బహుమతి… కుందా కోటేశ్వరరావుకు ఘన సత్కారం
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం గంపలగూడెం గ్రామానికి చెందిన దాత కుందా కోటేశ్వరరావు సమాజ సేవలో అరుదైన ఉదాహరణగా నిలిచారు. ఆయన తన సొంతంగా ఉన్న సుమారు రూ.25 లక్షల విలువైన 229 చ.గజాల నివేశన స్థలాన్ని లయన్స్ క్లబ్ తిరువూరు సంస్థకు బహుమతిగా అందజేశారు.
ఈ స్థలాన్ని అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసి, సంబంధిత ధాఖలాలు మరియు దస్తావేజులను విజయవాడలో నిర్వహించిన జిల్లా లయన్స్ క్లబ్ సమావేశంలో జిల్లా గవర్నర్ ఆంజనేయులు గారికి కోటేశ్వరరావు అందించారు.
కోటేశ్వరరావు చేసిన ఈ మహత్తర సేవను గుర్తిస్తూ, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మాజీ డైరెక్టర్ చిగురుపాటి వరప్రసాద్ ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ పి. వెంకటేశ్వరరావు, కంచర్ల ముత్య ప్రసాద్, గోగిరెడ్డి కృష్ణారెడ్డి, చలమాల శంకరరావు, డి. జ్వాలా నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
సమాజ సేవలో భాగంగా ఆస్తిని విరాళంగా అందించడం ద్వారా కోటేశ్వరరావు ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. ఆయన సేవా భావన సమాజంలో సానుకూల మార్పులకు దారి తీస్తుందని కార్యక్రమంలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.