మాధవ నగర్లో ప్రణయ చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభం
మాధవ నగర్/హఫీజ్పేట్ డివిజన్
మాధవ నగర్లో నూతనంగా ప్రారంభమైన “ప్రణయ చిల్డ్రన్స్ హాస్పిటల్” ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దామోదర్ రాజనర్సింహ, వి. జగదీశ్వర్ గౌడ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ వైద్యులు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో వారి సేవలు అత్యంత ముఖ్యమని, మానవ సేవకే తమ జీవితాన్ని అంకితం చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో అరెకపూడి గాంధీ, స్థానిక నాయకులు మరియు ప్రజల సమక్షంలో ఆసుపత్రిని ప్రారంభించారు. వి. జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మెరుగైన వైద్య సదుపాయాల కోసం ఈ ఆసుపత్రి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
అలాగే, వైద్యులు సమాజానికి వెన్నెముకలుగా నిలుస్తూ ప్రజలు ఆరోగ్యంగా జీవించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని వారు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బల్లింగ్ యాదగిరి గౌడ్, కనకమామిడి నరేందర్ గౌడ్, రవీందర్ రెడ్డి, కావూరి ప్రసాద్, మన్నేపల్లి సాంబశివరావు, హేమంత్, సుదర్శన్, వెంకటేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.