BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

మానవత్వం చాటుకున్న ధర్మాజీగూడెం ఎస్సై వెంకన్న

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Apr, 2026 - 02:24 PM
101 వీక్షణలు

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ములుగులంపాడు గ్రామంలో ఇటీవల జరిగిన ఘటన మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. కొడుకులు సరిగా చూడక ఇంటి బయట చెట్టు కింద నివసిస్తున్న వృద్ధురాలి పరిస్థితిపై మీడియా గ్రూపుల్లో వార్తలు వెలువడిన వెంటనే స్పందించిన ధర్మాజీగూడెం ఎస్సై వెంకన్న హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు.

స్థానికంగా పరిస్థితిని పరిశీలించిన ఎస్సై వెంకన్న, ఆ వృద్ధురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి బాధ్యతను గుర్తు చేశారు. అనంతరం వృద్ధురాలిని సమీపంలో ఉన్న మేనమామ ఇంటి వద్ద తాత్కాలికంగా ఉండేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా, త్వరలోనే ఆమెకు శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలని కుమారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

ఈ ఘటనతో ఎస్సై వెంకన్న మానవత్వం, బాధ్యతాయుత సేవాభావం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఇలాంటి ఫ్రెండ్లీ పోలీస్ అధికారులు ఉండటంతో ప్రజలు సురక్షితంగా, సంతోషంగా ఉన్నారని లింగపాలెం మండలం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.