మదనపల్లె మణప్పురం రితి జువలర్స్ లో భారీ మోసం
మదనపల్లె మణప్పురం రితి జువలర్స్ లో భారీ మోసం
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని మణప్పురం రితి జువెలరీస్ దుకాణంలో భారీ మోసం వెలుగు చూసింది. తరుగు, కూలి లేకుండా తక్కువ ధరకే బంగారం ఇస్తామని నమ్మ బలికి అమాయక ప్రజలు, వినియోగారులు, ఖాతాదారుల చెంత రూ. కోట్లల్లో డబ్బులు వసూలు చేసిన మేనేజర్ సూరజ్ పరారవడం సోమవారం రాత్రి స్థానికంగా తీవ్ర కలకం రేపింది. స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న మణప్పురం రితి జువెలరీస్ లో కేరళకు చెందిన సూరజ్ మేనేజర్ గా పని చేసేవాడు. ఈ క్రమంలో మణప్పురం జువెలరీ సంస్థ వినియోగదారులకు ఆకర్షణీయమైన పథకాలను ప్రవేశపెట్టింది. తరుగు, కూలీ లేకుండానే బంగారం ఇస్తాం అంటూ ఊదరగొట్టి. చీటీల రూపంలో నెల నెల సాధారణ ప్రజలు, ఖాతాదారులు, వినియోగదారుల నుండి డబ్బులు వసూలు పథకంలో పట్టణంతో పాటు జిల్లాలోని అనేక మందిని చేర్పించినట్లు తెలసింది. వీరి దగ్గర డబ్బు ప్రోగుచేసిన మేనేజర్ సూరజ్ పైకం మెత్తాన్ని ఐడీల ద్వారా దొంగ రసీదులు తయారుచేసి తన సొంత అకౌంటుకు వేయించుకున్నట్లు సమాచారం. ఇలా సుమారు రూ.2.5 కోట్లకుపైగా వినియోగదారుల డబ్బులు దారి మంల్లించి ఇటీవల సూరజ్ సమస్థకు కూడా బురిడికొట్టించి పరారయ్యాడు చీటీల కంతులు తీరిన బాధితులు, చీటీలు కట్టిన వారు క్యూ కడుతున్నావారికి యాజామాన్యం నుంచి ఎలాంటి భరోసా దక్కలేదు. దీంతో బాధితులు ప్రస్తుతం పనిచేస్తున్న మేనేజర్ మోహన్ ను నిలదీశారు. తాము సూరజ్ చేతిలో మేసపోయామని మాకు సమస్తే డబ్బు చెల్లించాలని డిమాండ్ చేశారు. తాము సమస్థను చూసి పెట్టుబడి పెట్టామని తమకు సమస్టనే పూచిపడి ఎప్పట్లోగా ఇస్తారో తెల్చాల్చి ఉందని నిలదీచారు. సమస్త మేనేజర్ నుంచి సమాధానం రాకపోవడంతో బాధితులు సమస్త ఎదుట నిరసనకు దిగి ఆందోళన చేశారు.