BREAKING
మంగళగిరి ఎయిమ్స్‌లో నాణ్యమైన వైద్యం – తక్కువ ఖర్చుతో సేవలు అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,00,000/-లను అందజేసిన ప్రమోద్ గుప్త, పూణే వాసి ఏప్రిల్ 21న శంకరజయంతి అన్న క్యాంటీన్లకు ఏటా రూ.50లక్షల విరాళం తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి పెద్దకాపర్తిలో బచ్చు లుకేందర్ రెడ్డి పదవీ విరమణ వేడుక జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ గర్జన మదనపల్లె అమ్మ చెరువు మిట్టపై ఘోర రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం... మంగళగిరి ఎయిమ్స్‌లో నాణ్యమైన వైద్యం – తక్కువ ఖర్చుతో సేవలు అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,00,000/-లను అందజేసిన ప్రమోద్ గుప్త, పూణే వాసి ఏప్రిల్ 21న శంకరజయంతి అన్న క్యాంటీన్లకు ఏటా రూ.50లక్షల విరాళం తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి పెద్దకాపర్తిలో బచ్చు లుకేందర్ రెడ్డి పదవీ విరమణ వేడుక జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ గర్జన మదనపల్లె అమ్మ చెరువు మిట్టపై ఘోర రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం నందిపేట్ లో ఘనంగా హిందూ సమ్మేళనం...
www.ntodaynews.com

మదనపల్లె తహసీల్దారుపై అవినీతి ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Apr, 2026 - 06:40 AM
95 వీక్షణలు

మదనపల్లె తహసీల్దారుపై అవినీతి ఆరోపణలు - కలెక్టరేట్‌కు అటాచ్

మదనపల్లె తహసీల్దారు కిషోర్ కుమార్ రెడ్డి పై అవినీతికి సంబంధించిన తీవ్రమైన ఆరోపణలు వెలుగు చూసాయి. స్థానిక ప్రజాప్రతినిధి ఫిర్యాదుపై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఫిర్యాదులో, డీకేటి భూములు, చుక్కల భూములు, మిలిటరీ భూములు వెబ్ లాండ్ సిస్టమ్‌లో ఎక్కించడాన్ని ఉల్లంఘనగా పేర్కొన్నారు.

ఈ అంశంపై జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ గత 10 రోజుల క్రితం తహసీల్దారును కలెక్టరేట్‌కు పిలిచి విచారించారు. ఆ విచారణ సమయంలో, తహసీల్దారు యొక్క బ్యాంకు ఖాతాలో భారీ మొత్తంలో నగదు బదిలీ అయినట్లు సీసీఎల్ఏ మరియు విజిలెన్స్ అధికారులు గుర్తించారు.

దీనిపై, కలెక్టర్ నిశాంత్ కుమార్, తహసీల్దారు కిషోర్ కుమార్ రెడ్డిని కలెక్టరేట్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా, తహసీల్దారు వద్ద ఉన్న ప్రభుత్వ సిమ్ కార్డు మరియు రెండు డిజిటల్ కీ లను స్వాధీనం చేసుకోవాలని అధికారులకు సూచించారు.

ఇది ఓ పెద్ద అవినీతి కుంభకోణంగా మారినట్లుగా సమాచారం వస్తోంది.