మదనపల్లి ఆర్టిసి బస్ లో కండక్టర్ దురుసు ప్రవర్తన..
ఆర్టీసీ బస్సులో కండక్టర్ దురుసు ప్రవర్తన
వృద్ధురాలిపై అనుచితంగా వ్యవహరించిన ఘటనపై ప్రయాణికుల ఆగ్రహం
మదనపల్లి | N Today News
మదనపల్లి ప్రాంతంలో పుంగనూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో కండక్టర్ దురుసు ప్రవర్తన కలకలం రేపింది.
బస్సులో కండక్టర్ సీట్లో కూర్చున్న వృద్ధురాలిపై కండక్టర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనుచిత పదజాలంతో దురుసుగా మాట్లాడినట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఇతర ప్రయాణికులపైనా కండక్టర్ అదే విధంగా ప్రవర్తించినట్లు సమాచారం.
అంతేకాకుండా, ఈ ఘటనను వీడియోగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన వారిపై కూడా కండక్టర్ దురుసుగా స్పందించినట్లు తెలుస్తోంది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
ఈ ఘటనపై స్పందించిన ప్రయాణికులు, ఇలాంటి ప్రవర్తనకు పాల్పడిన సిబ్బందిపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రజలకు సేవ చేయాల్సిన ఆర్టీసీ సిబ్బంది ఇలాంటి ప్రవర్తన ప్రదర్శించడం సరైంది కాదని, బాధ్యులపై చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.