BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

మదనపల్లి ఆర్టిసి బస్ లో కండక్టర్ దురుసు ప్రవర్తన..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
10 Apr, 2026 - 06:53 PM
92 వీక్షణలు

ఆర్టీసీ బస్సులో కండక్టర్ దురుసు ప్రవర్తన

వృద్ధురాలిపై అనుచితంగా వ్యవహరించిన ఘటనపై ప్రయాణికుల ఆగ్రహం

మదనపల్లి | N Today News

మదనపల్లి ప్రాంతంలో పుంగనూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో కండక్టర్ దురుసు ప్రవర్తన కలకలం రేపింది.

బస్సులో కండక్టర్ సీట్లో కూర్చున్న వృద్ధురాలిపై కండక్టర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనుచిత పదజాలంతో దురుసుగా మాట్లాడినట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఇతర ప్రయాణికులపైనా కండక్టర్ అదే విధంగా ప్రవర్తించినట్లు సమాచారం.

అంతేకాకుండా, ఈ ఘటనను వీడియోగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన వారిపై కూడా కండక్టర్ దురుసుగా స్పందించినట్లు తెలుస్తోంది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

ఈ ఘటనపై స్పందించిన ప్రయాణికులు, ఇలాంటి ప్రవర్తనకు పాల్పడిన సిబ్బందిపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రజలకు సేవ చేయాల్సిన ఆర్టీసీ సిబ్బంది ఇలాంటి ప్రవర్తన ప్రదర్శించడం సరైంది కాదని, బాధ్యులపై చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.