BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

మదనపల్లి_బెంగుళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
20 Mar, 2026 - 09:49 PM
108 వీక్షణలు

మదనపల్లి_బెంగుళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

అన్నమయ్య జిల్లా,మదనపల్లి- బెంగళూరు జాతీయ రహదారి చికిలబైల్ గ్రామ సచివాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.కుటుంబ సభ్యుల వివరాల మేరకు వివరాలు ఇలా ఉన్నాయి... 

కర్ణాటక రాష్ట్రం,శ్రీనివాసపురం తాలూకా, రాయల్పాడు గ్రామం నుంచి మదనపల్లి రూరల్ మండలం చీకలబైల్ స్వగ్రామానికి దిచక్ర వాహనంలో  వస్తుండగా చీకలబైల్ గ్రామ సచివాలయం వద్ద లారీ అతివేగoతో వెనుక వైపు నుండి దిచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులు అక్కడిక్కడే మృతి చెందారు.కాగా చిన్నారి తండ్రికి తీవ్రగాయాలు,మరో చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో క్షతగాత్రులను మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు మదనపల్లి రూరల్ మండలం, చీకలబైల్ గ్రామానికి చెందిన శ్రీనివాసులు రెడ్డి కుమారుడు భువనేష్ రెడ్డి(6)సంవత్సరాలు, శివారెడ్డి కుమారుడు కిషిల్ రెడ్డి(10) సంవత్సరాలు మృతి చెందారు.ఈ ప్రమాదం లో శివారెడ్డి,త్రితేష్ రెడ్డి 4 సంవత్సరాలు ప్రమాదం నుంచి బయటపడగా, శివారెడ్డి కుమారుడు ఒక్కరు మృతి చెందగా,మరో కుమారుడు తీవ్రగాయాలు కావడం జరిగింది.సమాచారం అందుకున్న మదనపల్లి  పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం  మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.చిన్నారుల మృతితో చీకలబయలు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. చిన్నారుల మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు మృతి చెందిన చిన్నారుల కుటుంబ సభ్యులను ఆసుపత్రి వద్దకు చేరుకొని ఓదార్చి పరామర్శించారు. అలాగే ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆసుపత్రి వద్దకు చేరుకొని చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను  ఎమ్మెల్యే షాజహాన్ భాష,తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు ఆదేశించారు..