BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

మద్యం మత్తులో ఆర్టీసీ కండక్టర్ వీరంగం.. ప్రయాణికులతో దురుసు ప్రవర్తన!

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 11:15 AM
75 వీక్షణలు

పల్నాడు జిల్లా, వినుకొండ: వినుకొండ డిపోకు చెందిన ఓ ఆర్టీసీ బస్సు కండక్టర్ డ్యూటీ సమయంలో మద్యం మత్తులో విధులు నిర్వహిస్తూ ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించాడని ఆరోపణలు వెల్లువెత్తాయి.

వినుకొండ నుంచి దోమలగూడెం వెళ్తున్న బస్సులో కండక్టర్ ఒక చేతిలో సిగరెట్ పట్టుకుని ప్రయాణికులతో బూతులు మాట్లాడినట్లు ప్రయాణికులు తెలిపారు. మహిళా ప్రయాణికుల పట్ల కూడా అసభ్య పదజాలం ఉపయోగిస్తూ అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపించారు.

డ్యూటీలో ఉండగానే మద్యం సేవించినట్లు కనిపించాడని, అతడి ప్రవర్తనతో బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని వారు తెలిపారు.

ఈ ఘటనపై ఆర్టీసీ ఉన్నతాధికారులు వెంటనే విచారణ చేపట్టి, నిజానిజాలు నిర్ధారించి సంబంధిత కండక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు.