మధిరలో మహిళ మత్స్య సంఘ నూతన కమిటీకి ఘన సన్మానం
మధిరలో మహిళ మత్స్య సంఘ నూతన కమిటీకి ఘన సన్మానం
బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి మహిళలకు న్యాయం చేయాలి : పులిపాటి సుబ్బారావు
మధిర: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మధిర మండలంలో మహిళ మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి ఎన్నికైన నూతన అధ్యక్షులు, కార్యదర్శులను మధిర మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు పులిపాటి సుబ్బారావు, మంగమ్మ దంపతులు ఘనంగా సన్మానించారు.
బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన మహిళ మత్స్య సహకార సంఘం అధ్యక్షులు, కార్యదర్శులకు శాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం పులిపాటి సుబ్బారావు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు.
మహిళ మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో ఉన్న ప్రతి సభ్యురాలికి సమాన న్యాయం జరిగే విధంగా అధ్యక్షులు, కార్యదర్శులు పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు. సంఘ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మహిళ మత్స్య పారిశ్రామిక సహకార సంఘ నూతన కమిటీ సభ్యులు, మధిర మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులు పాల్గొన్నారు.