పోరుమామిళ్లలో పట్టాభిరామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట..
పోరుమామిళ్లలో పట్టాభిరామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట.. హాజరుకానున్న సినీ నిర్మాత దిల్ రాజు, హీరో వంశీకృష్ణ
కడప జిల్లా పోరుమామిళ్లకు నేడు సినీ ప్రముఖుల రాక
కడప జిల్లా పోరుమామిళ్లలో నేడు ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు, యువ హీరో వంశీకృష్ణ పర్యటించనున్నారు. పోరుమామిళ్లలోని జేఎన్ఆర్ నగర్లో నూతనంగా నిర్మించిన శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొననున్నారు.
ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరవుతుండటంతో స్థానికుల్లో ఆసక్తి నెలకొంది.
పట్టాభిరామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.