BREAKING
పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం
www.ntodaynews.com

పోరుమామిళ్లలో పట్టాభిరామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట..

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Aug, 2026 - 09:07 AM
8 వీక్షణలు

పోరుమామిళ్లలో పట్టాభిరామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట.. హాజరుకానున్న సినీ నిర్మాత దిల్ రాజు, హీరో వంశీకృష్ణ

కడప జిల్లా పోరుమామిళ్లకు నేడు సినీ ప్రముఖుల రాక

కడప జిల్లా పోరుమామిళ్లలో నేడు ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు, యువ హీరో వంశీకృష్ణ పర్యటించనున్నారు. పోరుమామిళ్లలోని జేఎన్‌ఆర్ నగర్‌లో నూతనంగా నిర్మించిన శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొననున్నారు.

ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరవుతుండటంతో స్థానికుల్లో ఆసక్తి నెలకొంది.

పట్టాభిరామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.