పుంగనూరు తాహసిల్దార్ కి సిపిఐ పార్టీ వ్రాసుకున్న వినతి.
పుంగనూరు తాహసిల్దార్ కి సిపిఐ పార్టీ వ్రాసుకున్న వినతి.
అర్హత కలిగిన గ్రామీణ, పట్టణ, పేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ప్రభుత్వాన్ని కోరుచున్నాము. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు స్థలం కేటా యించాలి.
ప్రస్తుతం పెరుగుతున్న ఇంటి సామాగ్రి ఖర్చులకు అనుగుణంగా ఐదు లక్షల పెంచాలని పెంచాలని, ఇల్లు కట్టించే వరకు పేదల ఇంటి అద్దెను ప్రభుత్వమే చెల్లించాలి టిడ్కో ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము.
ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి రామ్మూర్తి, సహాయ కార్యదర్శి మున్నా, ఏఐటియుసి పట్టణ ప్రధాన కార్యదర్శి వెంకటరమణారెడ్డి, AISF మాజీ నాయకులు శ్రీరాములు
నాయకులు శైలజ, ఆదెమ్మ, ముబీనా, శబ్రీన్ తాజ్, తదితరులు పాల్గొన్నారు
భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)
పుంగనూరు
అన్నమయ్య జిల్లా