www.ntodaynews.com
మహాత్మా గాంధీ వర్సిటీలో ‘జల’ జ్వాల
తెలంగాణ
/
నల్గొండ
/
నల్గొండ
మహాత్మా గాంధీ వర్సిటీలో ‘జల’ జ్వాల
గత ఏడాది కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఓ ట్రాక్టర్ దొంగతనం కేసును నార్కెట్పల్లి పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. అంతర్రాష్ట్ర దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి రూ. 2.50 లక్షల విలువైన ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు. 2025 సంవత్సరం 8 నెల 7 వ తేదీన తెల్లవారుజామున దాసరిగూడెం గ్రామంలో నిలిపి ఉంచిన టీఎస్ 05 ఎఫ్ ఎన్ 8272 నెంబర్ గల ట్రాక్టర్ అదృశ్యమైంది. బాధితుడు నకరేకంటి రమేష్ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నార్కెట్పల్లి సీఐ కె. నాగరాజు పర్యవేక్షణలో ఎస్సై పి. విష్ణుమూర్తి నేతృత్వంలోని ప్రత్యేక బృందంతో సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు నిందితులను గుర్తించి, గురువారం వారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ నిందితులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా కరుచోళ గ్రామానికి చెందిన మదన రవీంద్రనాథ్ రెడ్డి (35),
ఎన్నిరెడ్డి బాపిరెడ్డి (40) అనే నిందితులు ఉన్నారు. వీరి వద్ద నుండి దొంగిలించిన ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. సుదీర్ఘ కాలం తర్వాత నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఎస్సై విష్ణుమూర్తిని మరియు పోలీసు సిబ్బందిని సీఐ నాగరాజు ప్రత్యేకంగా అభినందించారు.