BREAKING
బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌పై కూటమి నేతల విజయోత్సవ ర్యాలీ గుడిపాల మండలం బొమ్మసముద్రం వద్ద అక్రమ బియ్యం పట్టివేత హోటళ్లు, రెస్టారెంట్లలో కల్తీల కలకలం.. బయటి ఆహారంపై అప్రమత్తత అవసరం గుడిపాల మండలంలో అక్రమ ఇసుక తరలింపు.. ముగ్గురిపై కేసు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌పై కూటమి నేతల విజయోత్సవ ర్యాలీ గుడిపాల మండలం బొమ్మసముద్రం వద్ద అక్రమ బియ్యం పట్టివేత హోటళ్లు, రెస్టారెంట్లలో కల్తీల కలకలం.. బయటి ఆహారంపై అప్రమత్తత అవసరం గుడిపాల మండలంలో అక్రమ ఇసుక తరలింపు.. ముగ్గురిపై కేసు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి
www.ntodaynews.com

మహిళ ఆత్మ హత్యాయత్నం ప్రయత్నం...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
19 Aug, 2026 - 08:02 PM
10 వీక్షణలు

పొలం వివాదంలో మహిళ ఆత్మహత్యాయత్నం

అన్నమయ్య జిల్లా పుంగనూరు

పుంగనూరు మండలం వనమల దిన్నె పంచాయతీ మేకన జామనపల్లి గ్రామంలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన ఆర్. మురళి భార్య ఆర్. కవిత బుధవారం తన వ్యవసాయ పొలంలో పశువులకు ఉపయోగించే క్రిమిసంహారక ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం.

వివరాల్లోకి వెళితే.. మురళికి సంబంధించిన వ్యవసాయ పొలంలో దారి విషయంలో కొన్ని సంవత్సరాలుగా సుధాకర్ నాయుడు, ఆయన కుమారుడు పవన్‌తో మురళి కుటుంబానికి వివాదం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో మురళి వ్యక్తిగత పని నిమిత్తం మదనపల్లికి వెళ్లిన విషయం తెలుసుకున్న సుధాకర్ నాయుడు, పవన్ జేసీబీతో తమ పొలాన్ని చదును చేస్తూ, ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలించి మురళి పొలంలో దారి కోసం వేయడం ప్రారంభించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ విషయం తెలుసుకున్న మురళి భార్య కవిత అక్కడికి వెళ్లి ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

తీవ్ర మనస్తాపానికి గురైన కవిత పశువులకు ఉపయోగించే క్రిమిసంహారక ద్రావణం తాగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే ఆమెను పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.