ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే 135వ వర్ధంతి
NTODAY NEWS: పుంగనూరు
పుంగనూరులో ప్రజా సంఘాలు నాయకులు మహాత్మా జ్యోతిరావు ఫూలే 135వ వర్ధంతిని నిర్వహించారు. ఇందిరా సర్కిల్లో ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు, సామాజిక ఉద్యమకారుడు ఫూలే అని కొనియాడారు. విశ్రాంత DSP సుకుమార్ బాబు, SI రమణ తదితరులు పాల్గొన్నారు. బీసీ సంఘాల అధ్యక్షులు, తమ్మిరెడ్డిపల్లి కృష్ణమూర్తి, మైనారిటీ నాయకులు డాక్టర్ అయూబ్ ఖాన్, బీజేపీ పట్టణ అధ్యక్షులు జగదీష్ రాజు , బిజెపి మహిళా అధ్యక్షురాలు మల్లికా రాణి శ్రీమతి ప్రతిభ మైనార్టీ సంఘాల అధ్యక్షురాలు షబానా, ఉపాధ్యక్షురాలు చిట్టెమ్మ, మొగిలప్ప యాదవ్, జై శివయ్య, అద్దాల నాగరాజు, గంగులప్పా, బెస్త కామేశ్వర, బెస్త దొరస్వామి, వినయ్ కుమార్, విజయ్, మునుస్వామి, నారాయణస్వామి, మొదలగువారు పాల్గొని, బడుగు బలహీన వర్గాల జాతిపిత అయిన శ్రీ మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి ఘనమైన నివాళులర్పించారు వారు మాట్లాడుతూ బహుజనుల అభివృద్ధి కోసం అన్యమ్న జాతుల హక్కుల సాధన కోసం అహర్నిశలు పోరాడిన మహానుభావులను స్మరించుకోవడం మన అణగారిన వర్గాల యొక్క అభివృద్ధికి స్వచ్ఛంగా కనబడుతున్నది అని కొనియాడారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube