BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

మిర్యాలగూడలో పోలీసుల మెగా నాకాబందీ.. 150 వాహనాలపై కేసులు, 40 మంది డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టివేత

తెలంగాణ
/ నల్గొండ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 12:53 PM
75 వీక్షణలు

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పోలీసులు నిర్వహించిన మెగా నాకాబందీలో విస్తృత తనిఖీలు చేపట్టారు. రాత్రంతా కొనసాగిన ఈ తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 150 వాహనాలపై కేసులు నమోదు చేయగా, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 40 మందిని పోలీసులు పట్టుకున్నారు.

ట్రిపుల్ రైడింగ్, మైనర్లు వాహనాలు నడపడం, నంబర్ ప్లేట్ లేని వాహనాలు, మోడిఫైడ్ సైలెన్సర్లతో తిరుగుతున్న వాహనాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

అసాంఘిక కార్యకలాపాలు, బైక్ రేసింగ్‌లు, అర్ధరాత్రి హల్‌చల్ సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. గంజాయి, మట్కా, జూదం, అక్రమ మద్యం విక్రయాలపై ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

నిర్ణీత సమయం దాటిన తర్వాత దాబాలు, కేఫ్‌లు, టీ స్టాళ్లు, రెస్టారెంట్లు నిర్వహిస్తున్న యజమానులపైనా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.