BREAKING
నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం
www.ntodaynews.com

తెలంగాణలో ఇసుక లోడింగ్ బంద్.. 35 క్వారీల్లో కార్యకలాపాలు నిలిపివేత

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 12:53 PM
24 వీక్షణలు

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా 35 ఇసుక క్వారీల్లో బుధవారం నుంచి లోడింగ్ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు కాంట్రాక్టర్లు ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని 18 ఇసుక క్వారీల్లో కూడా లోడింగ్ పూర్తిగా నిలిచిపోనుంది.

డీజిల్ ధరలు భారీగా పెరగడంతో నిర్వహణ ఖర్చులు పెరిగిపోయాయని, ప్రస్తుత పరిస్థితుల్లో క్వారీల నిర్వహణ ఆర్థికంగా భారంగా మారిందని కాంట్రాక్టర్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో తమకు చెల్లించాల్సిన సుమారు రూ.300 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వం తమ సమస్యలపై వెంటనే స్పందించి బకాయిల చెల్లింపుతో పాటు ఇసుక క్వారీల నిర్వహణకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని కాంట్రాక్టర్లు హెచ్చరించారు. ఇసుక లోడింగ్ బంద్ కారణంగా నిర్మాణ రంగంపై ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.