BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

తెలంగాణలో ఇసుక లోడింగ్ బంద్.. 35 క్వారీల్లో కార్యకలాపాలు నిలిపివేత

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 12:53 PM
69 వీక్షణలు

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా 35 ఇసుక క్వారీల్లో బుధవారం నుంచి లోడింగ్ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు కాంట్రాక్టర్లు ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని 18 ఇసుక క్వారీల్లో కూడా లోడింగ్ పూర్తిగా నిలిచిపోనుంది.

డీజిల్ ధరలు భారీగా పెరగడంతో నిర్వహణ ఖర్చులు పెరిగిపోయాయని, ప్రస్తుత పరిస్థితుల్లో క్వారీల నిర్వహణ ఆర్థికంగా భారంగా మారిందని కాంట్రాక్టర్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో తమకు చెల్లించాల్సిన సుమారు రూ.300 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వం తమ సమస్యలపై వెంటనే స్పందించి బకాయిల చెల్లింపుతో పాటు ఇసుక క్వారీల నిర్వహణకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని కాంట్రాక్టర్లు హెచ్చరించారు. ఇసుక లోడింగ్ బంద్ కారణంగా నిర్మాణ రంగంపై ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.