BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

తెలంగాణలో ఇసుక లోడింగ్ బంద్.. 35 క్వారీల్లో కార్యకలాపాలు నిలిపివేత

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 12:53 PM
113 వీక్షణలు

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా 35 ఇసుక క్వారీల్లో బుధవారం నుంచి లోడింగ్ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు కాంట్రాక్టర్లు ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని 18 ఇసుక క్వారీల్లో కూడా లోడింగ్ పూర్తిగా నిలిచిపోనుంది.

డీజిల్ ధరలు భారీగా పెరగడంతో నిర్వహణ ఖర్చులు పెరిగిపోయాయని, ప్రస్తుత పరిస్థితుల్లో క్వారీల నిర్వహణ ఆర్థికంగా భారంగా మారిందని కాంట్రాక్టర్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో తమకు చెల్లించాల్సిన సుమారు రూ.300 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వం తమ సమస్యలపై వెంటనే స్పందించి బకాయిల చెల్లింపుతో పాటు ఇసుక క్వారీల నిర్వహణకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని కాంట్రాక్టర్లు హెచ్చరించారు. ఇసుక లోడింగ్ బంద్ కారణంగా నిర్మాణ రంగంపై ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.