BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
07 Jun, 2026 - 10:23 PM
13 వీక్షణలు

అన్నమయ్య జిల్లా 

తంబళ్లపల్లె - జూన్ 07 తంబళ్లపల్లె నియోజకవర్గానికి తలమానికంగా నిలిచిన మల్లయ్య కొండ బైపాస్ రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలని శివ భక్తులు, ప్రజలు కోరుతున్నారు. ప్రతిరోజు మల్లయ్య కొండకు వేలాదిగా భక్తులు మల్లయ్య కొండ మహా శివుని దర్శనానికి వస్తుంటారు. తంబళ్లపల్లి ఆర్టీసీ బస్టాండ్ నుండి ఆర్టీసీ బస్సులు పాత బస్టాండ్ రాగి మాను రచ్చ రహదారి గుండా కొండకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో అక్కమ్మ చెరువు కట్టమీదుగా బైపాస్ రోడ్డు ద్వారా ఆర్టీసీ బస్టాండ్ కు చేరుకుంటుంది. మల్లయ్య కొండకు వెళ్లే అక్కమ్మ చెరువు కట్టపై పిచ్చి మొక్కలు పెరిగి రోడ్డు గుంతల మయమైంది. ఆర్టీసీ బస్టాండ్ నుండి మల్లయ్య కొండ రహదారితో పాటు తంబళ్లపల్లె సచివాలయం, విద్యుత్ సబ్స్టేషన్, కాలనీ లేఅవుట్, ఇట్నేని వారి పల్లి,బీసీ గురుకుల పాఠశాల నిర్మాణ స్థలం వరకు రోడ్డు, సాయిబాబా గుడి నుండి ఎమ్మెల్యే స్వగృహం, పిఆర్ గెస్ట్ హౌస్ (ప్రస్తుత తాసిల్దార్ కార్యాలయం) మీదుగా క్రాస్ రోడ్డు వరకు మరమ్మతులు చేపడితే రోడ్లు ప్రజలకు, భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని ప్రజలు కోరుతున్నారు