మల్యాల గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
మల్యాల గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎస్.ఐ బుగ్గ శ్రీశైలం, గ్రామ సర్పంచ్ దొమ్మాట రమాదేవి శంకర్
యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, మల్యాల గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 జయంతి వేడుకలు మంగళవారం రోజున ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు ఊట్ల రమేష్ మాదిగ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎస్ఐ బుగ్గ శ్రీశైలం, గ్రామ సర్పంచ్ దొమ్మాట రమాదేవి శంకర్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత, ప్రముఖ న్యాయవాది, ఆర్థికవేత్త మరియు సంఘ సంస్కర్త అని అన్నారు అంటరానితనం, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి, అణగారిన వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు అని అన్నారు స్వతంత్ర భారతదేశపు మొదటి న్యాయ మంత్రిగా పనిచేశారు అని,డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీవిత చరిత్ర ముఖ్యాంశాలను వివరించారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని మోవ్ (ప్రస్తుత డాక్టర్ అంబేద్కర్ నగర్) లో రామ్జీ మాలోజీ సక్పాల్, భీమాబాయి దంపతులకు 14వ సంతానంగా జన్మించారు అని అన్నారు మహర్ సామాజిక వర్గానికి చెందిన ఆయన, చిన్నతనంలో తీవ్రమైన కుల వివక్షను ఎదుర్కొన్నారు అని అన్నారు కొలంబియా విశ్వవిద్యాలయం మరియు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి డాక్టరేట్లు పొందారు.1927లో మహాద్ సత్యాగ్రహం ద్వారా దళితులకు నీటి హక్కు కోసం పోరాడారు. 'బహిష్కృత భారత్' వంటి పత్రికల ద్వారా దళిత హక్కుల కోసం అవగాహన కల్పించారు అని అన్నారు భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా వ్యవహరించి, సమతా, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం ఆధారంగా రాజ్యాంగాన్ని రూపొందించారు. అని అన్నారు హిందూ మతంలోని కుల వ్యవస్థను నిరసిస్తూ, 1956 అక్టోబర్ 14న బౌద్ధమతాన్ని స్వీకరించారు అని అన్నారు 1956 డిసెంబర్ 6న ఢిల్లీలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మరణించారు అని అన్నారు 1990లో ఆయనకు అత్యున్నత పౌర పురస్కారం 'భారత రత్న' లభించింది అని అన్నారు అంబేద్కర్ అణగారిన వర్గాల సాధికారతకు మరియు సామాజిక సమానత్వానికి చేసిన కృషి చిరస్మరణీయమైనది అని అన్నారుఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మైలారం సంజీవ, నాయకులు పోలగోని వెంకటేష్ గౌడ్,బోనంకూర మల్లేష్,గ్రామ పంచాయతీ కార్యదర్శి రాంబాబు,వార్డు సభ్యులు నాయకులు మైలారం నరసింహ, ఊట్ల రమేష్, ఊట్ల రాజు,పగడిపల్లి వెంకటేష్, మైలారం సుదర్శన్, మైలారం ఆశయ్య,మైలారం మహేష్,జల్ల శ్రీరాములు,బోనంకూర సహదేవ్, ఆదర్శ యూత్ సభ్యులు మైలారం అనిల్, ఊట్ల గణేష్, ఊట్ల ప్రవీణ్,బాసారం శ్రీరాములు,బాసారం లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు