www.ntodaynews.com
మంచినీళ్లు ఆలస్యంగా ఇచ్చిందని తల్లిని హత్య చేసిన కొడుకు
ఆంధ్రప్రదేశ్
/
కాకినాడ
కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఫ్రిజ్లోని మంచినీళ్లు తీసుకురావడం ఆలస్యమైందనే ఆగ్రహంతో రాజబాబు అనే యువకుడు తన తల్లి పెంటా నాగమణి (45)పై దాడి చేశాడు.
పూజా గదిలో ఉన్న చెక్క బల్లకు ఆమె తలను బలంగా బాదడంతో తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావంతో స్పృహ కోల్పోయిన నాగమణిని కుటుంబ సభ్యులు కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రాజబాబును అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.