www.ntodaynews.com
మంచిర్యాల: గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
మంచిర్యాల: స్థానిక రైల్వే స్టేషన్ ముందున్న బహిరంగ ప్రదేశంలో సుమారు 30-35 ఏళ్ల వయసున్న ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు మంచిర్యాల టౌన్ పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరిచినట్లు వెల్లడించారు. మృతుడి వివరాలు లేదా ఇతర సమాచారం ఏమైనా తెలిసినవారు వెంటనే 8712656534, 8712656535 నంబర్లలో తమను సంప్రదించాలని పోలీసులు కోరారు