www.ntodaynews.com
లక్షెట్టిపేట: రాజీమార్గమే రాజమార్గం.. సివిల్ జడ్జి కవిత
తెలంగాణ
/
మంచిర్యాల
/
లక్సెట్టిపేట
లక్షెట్టిపేట, జూన్ 20:కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండే కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి రాజీమార్గమే రాజమార్గమని లక్షెట్టిపేట జూనియర్ సివిల్ జడ్జి కవిత పేర్కొన్నారు. శనివారం స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జడ్జి కవిత మాట్లాడుతూ.. లోక్ అదాలత్ ద్వారా పరస్పర అంగీకారంతో, రాజీకి వచ్చిన అనేక కేసులను త్వరితగతిన పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా చిన్న చిన్న సివిల్ కేసులు, క్షణికావేశంలో చేసిన నేరాలకు సంబంధించిన వివాదాలను లోక్ అదాలత్ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా, సులువుగా పరిష్కరించుకోవచ్చని ఆమె వెల్లడించారు. ఈ అవకాశాన్ని అర్హులైన పక్షాలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు