BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

జనపనార సాగుపై రైతులకు సమగ్ర అవగాహన

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / పెద్దకాపర్తి
20 Jun, 2026 - 04:43 PM
240 వీక్షణలు

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో జనపనార పైలట్ ప్రాజెక్టు కింద రైతులకు అవగాహన మరియు విత్తనాల పంపిణీ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జనపనార సాగుపై రైతులకు శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు సమగ్ర అవగాహన కల్పించారు. అధికారుల పిలుపునకు స్పందించి గ్రామంలో సుమారు 50 నుండి 100 ఎకరాల్లో జనపనార సాగు చేయడానికి రైతులు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ​ఈ సందర్భంగా విచ్చేసిన వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు మాట్లాడుతూ జనపనార సాగులో పాటించాల్సిన మెలకువలు, విత్తనాలు విత్తే పద్ధతుల గురించి రైతులకు వివరించారు. ఆధునిక సాగు పద్ధతులు పాటిస్తే ఎకరాకు సుమారు 12 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధించవచ్చని పేర్కొన్నారు. పచ్చిరొట్ట (జనపనార)ను క్వింటాకు రూ. 4,500 నుండి రూ. 5,000 వరకు చెల్లించి తామే స్వయంగా కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. దీనివల్ల రైతులకు మార్కెటింగ్ ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు.. తక్కువ పెట్టుబడి, తక్కువ నీటితో ఎక్కువ లాభాలు గడించడానికి జనపనార సాగు ఎంతగానో దోహదపడుతుంది అని, పైలట్ ప్రాజెక్టును రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ​వ్యవసాయ అధికారులు & శాస్త్రవేత్తలుబిడైరెక్టర్ డాక్టర్ ప్రసన్నకుమార్, డైరెక్టర్ గుండె పద్మ, చంద్రశేఖర్ (వ్యవసాయ శాస్త్రవేత్త), ఏవో  గిరిబాబు. సింగిల్ విండో చైర్మన్ ఏనుగు రఘునారెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ ఓర్సు సైదులు, సింగిల్ విండో డైరెక్టర్ ఎదుల అజిత్ రెడ్డి.

​ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, విత్తనాలు స్వీకరించిన లబ్ధిదారులైన గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.