మంచిర్యాల గురుకుల డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం
మంచిర్యాల గురుకుల డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం
మంచిర్యాల : మంచిర్యాల పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ పురుషుల గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రస్తుత విద్యాసంవత్సరానికి గాను డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కొరకు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోందని కళాశాల ప్రిన్సిపాల్ డా. పురుషోత్తం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో BSc, BCom, BA విభాగాల్లో వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయని, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ గురుకులంలో చేరిన విద్యార్థులకు ప్రభుత్వం తరపున ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత భోజనం మరియు ఉచిత హాస్టల్ వసతి కల్పించడం జరుగుతుందని, ఆసక్తి గల విద్యార్థులు వెంటనే కళాశాలలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ డా. పురుషోత్తం ఈ సందర్భంగా పేర్కొన్నారు