BREAKING
తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ
Date of Publish : 21 March 2026, 03:15 pm
Posted by : V శ్రీనివాస్

మంచిర్యాల పట్టణ అభివృద్ధి పనుల పరిశీలన

తెలంగాణ
/ మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
21 Mar, 2026 - 03:15 PM
216 వీక్షణలు

మంచిర్యాల పట్టణ అభివృద్ధి పనుల పరిశీలన: రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపడమే నా లక్ష్యం - ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ నుండి శ్రీనివాస్ థియేటర్ వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ మరియు అభివృద్ధి పనులను శనివారం మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అభివృద్ధి విషయంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండాలనేదే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పట్టణ సుందరీకరణలో భాగంగా చేపట్టిన ఈ విస్తరణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యతతో, నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం, ఈ అభివృద్ధి కార్యక్రమానికి సహకరిస్తున్న మున్సిపల్ అధికారులకు, స్థానిక వ్యాపారస్తులకు మరియు ప్రజలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పట్టణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు