మంచిర్యాల పట్టణ అభివృద్ధి పనుల పరిశీలన
మంచిర్యాల పట్టణ అభివృద్ధి పనుల పరిశీలన: రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపడమే నా లక్ష్యం - ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ నుండి శ్రీనివాస్ థియేటర్ వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ మరియు అభివృద్ధి పనులను శనివారం మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అభివృద్ధి విషయంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండాలనేదే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పట్టణ సుందరీకరణలో భాగంగా చేపట్టిన ఈ విస్తరణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యతతో, నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం, ఈ అభివృద్ధి కార్యక్రమానికి సహకరిస్తున్న మున్సిపల్ అధికారులకు, స్థానిక వ్యాపారస్తులకు మరియు ప్రజలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పట్టణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు