www.ntodaynews.com
రైలు ఢీకొని వ్యక్తి మృతి
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
మంచిర్యాల: రైలు ఢీకొని వ్యక్తి మృతి
మంచిర్యాల పట్టణంలోని హమాలీవాడ పాత రైల్వే గేట్ సమీపంలో చోటుచేసుకున్న రైలు ప్రమాదంలో చింతపండువాడకు చెందిన గాదర్ల చంద్రశేఖర్ అనే వ్యక్తి దుర్మరణం చెందారు. రేషన్ బియ్యం తీసుకురావడానికి ఇంటి నుండి బయలుదేరిన ఆయన, పట్టాలు దాటుతుండగా అకస్మాత్తుగా వచ్చిన గూడ్స్ రైలు ఢీకొనడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై జీఆర్పీ ఎస్సై మహేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.