BREAKING
ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కేంద్రం కొత్త రూల్స్.. సిలిండర్ కట్! శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో బీసీవై పార్టీ నాయకులు సత్య ప్రమాణం శాంతియుత వాతావరణంలో బక్రీద్.. మహానాడు కు పెద్ద ఎత్తున హాజరైన తెలుగు తమ్ముళ్లు.. జిల్లా జడ్జిని కలిసిన న్యాయవాదుల సంఘం సభ్యులు.. రైలులో చోరీ.. నిందితుల అరెస్టు ​బాల్క సుమన్‌పై దేశద్రోహం ఫిర్యాదు: రాజకీయ నిషేధం విధించాలని రామిళ్ల రాధిక డిమాండ్ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు: మంత్రి గడ్డం వివేకానంద అన్నారం ప్రభుత్వ బడిలో LKG, UKG మంజూరు: సర్పంచ్, గ్రామ పెద్దలు, ప్రజల పిలుపు! నార్కట్‌పల్లిలో బైకులు, మేకల దొంగల అరెస్ట్ ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కేంద్రం కొత్త రూల్స్.. సిలిండర్ కట్! శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో బీసీవై పార్టీ నాయకులు సత్య ప్రమాణం శాంతియుత వాతావరణంలో బక్రీద్.. మహానాడు కు పెద్ద ఎత్తున హాజరైన తెలుగు తమ్ముళ్లు.. జిల్లా జడ్జిని కలిసిన న్యాయవాదుల సంఘం సభ్యులు.. రైలులో చోరీ.. నిందితుల అరెస్టు ​బాల్క సుమన్‌పై దేశద్రోహం ఫిర్యాదు: రాజకీయ నిషేధం విధించాలని రామిళ్ల రాధిక డిమాండ్ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు: మంత్రి గడ్డం వివేకానంద అన్నారం ప్రభుత్వ బడిలో LKG, UKG మంజూరు: సర్పంచ్, గ్రామ పెద్దలు, ప్రజల పిలుపు! నార్కట్‌పల్లిలో బైకులు, మేకల దొంగల అరెస్ట్
www.ntodaynews.com

రైలులో చోరీ.. నిందితుల అరెస్టు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
27 May, 2026 - 07:59 PM
14 వీక్షణలు

మంచిర్యాల రైలులో ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను రైల్వే రక్షక దళ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 25న రైలులో ప్రయాణిస్తున్న కొందరు ప్రయాణికుల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో బుధవారం మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఎండి. రేహాన్, రాఘవేంద్ర, వెంకటేశ్వర్లుతో పాటు కొందరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, తామే రైలులో దొంగతనం చేసినట్లు నేరాన్ని అంగీకరించారు. వారి వద్ద నుండి బంగారు చెవి కమ్మలు, 6 ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు, నిందితులపై కేసు నమోదు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు తెలిపారు. రైల్వే స్టేషన్లు, రైళ్లలో ప్రయాణికులు తమ వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఈ సందర్భంగా సూచించారు