www.ntodaynews.com
సింగరేణి కార్మికులకు మరో శుభవార్త
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
మంచిర్యాల: సింగరేణి కార్మికులకు మరో శుభవార్త
సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం సింగరేణి యాజమాన్యం మరియు యూనియన్ బ్యాంక్ సంయుక్తంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వ చొరవతో కార్మికులకు అందించిన రూ. కోటి ప్రమాద బీమా పథకానికి కొనసాగింపుగా, ఇప్పుడు సహజ మరణానికి (Natural Death) కూడా రూ. 10 లక్షల ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పించాలని యూనియన్ బ్యాంక్ నిర్ణయించింది. ఈ నెల 1వ తేదీ నుంచే అమలులోకి రానున్న ఈ పథకం ద్వారా, కార్మికులు సహజంగా మరణించినా వారి కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక భరోసా లభిస్తుంది. కార్మికుల కుటుంబాల భవిష్యత్తుకు మరింత రక్షణ కల్పించేలా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సింగరేణి వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది