www.ntodaynews.com
మంచిర్యాలలో కానిస్టేబుల్ ఆత్మహత్య
తెలంగాణ
/
మంచిర్యాల
/
మందమర్రి
మంచిర్యాలలో కానిస్టేబుల్ ఆత్మహత్య
మందమర్రి పట్టణంలోని ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన కానిస్టేబుల్ అరవింద్ యాదవ్(25) రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామన్కాలనీ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద మూడవ రైల్వే లైన్పై ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న బెల్లంపల్లి రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.