BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

​మంచిర్యాలలో ముగిసిన 24 గంటల బీసీల నిరవధిక దీక్ష

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
08 Apr, 2026 - 02:46 PM
159 వీక్షణలు

​మంచిర్యాలలో ముగిసిన 24 గంటల బీసీల నిరవధిక దీక్ష: ప్రభుత్వాలకు హెచ్చరిక

మంచిర్యాల పట్టణంలోని గాంధీ పార్కులో బీసీల డిమాండ్ల సాధనకై గుమ్మల శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపట్టిన 24 గంటల నిరవధిక దీక్షను డాక్టర్ రఘునందన్ మరియు ఇతర నాయకులు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రఘునందన్ మాట్లాడుతూ, దేశ జనాభాలో సగభాగానికి పైగా ఉన్న బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో జనాభా నిష్పత్తి ప్రకారం వాటా దక్కకపోవడం బాధాకరమని, 10 శాతం లేని అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించి బీసీల న్యాయమైన డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించడం అన్యాయమని పేర్కొన్నారు. రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీలంతా సంఘటితమై ఉద్యమించాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో నిరసనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది కర్రే లచ్చన్న, తెలంగాణ గంగపుత్రుల సంఘం జిల్లా అధ్యక్షులు వెన్నెల నరసయ్య, బీసీ కులాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సదానందం, బీసీ నాయకులు వేముల అశోక్, కొట్టే నటేశ్వర్, శెట్టిపల్లి గట్టయ్య, రామగిరి రాజన్న చారి, గగ్గూరి రాజన్న, మాచర్ల పోచం, తిరుపతి, మరియు అకిరా జాను తదితరులు పాల్గొని తమ మద్దతును ప్రకటించారు