మందమర్రి సహకార సంఘం కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
మందమర్రి సహకార సంఘం కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
జాతీయ జెండాను ఆవిష్కరించిన డీసీసీబీ డైరెక్టర్ సల్వాజి ప్రభాకర్ రావు
సహకార సంఘాలకు నామినేటెడ్ పద్ధతి వద్దు.. ఎన్నికలు నిర్వహించాలి: ప్రభుత్వానికి విజ్ఞప్తి
మందమర్రి, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మందమర్రి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మందమర్రి సహకార సంఘం చైర్మన్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ (DCCB) డైరెక్టర్ శ్రీ సల్వాజి ప్రభాకర్ రావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సహకార సంఘాలను నామినేటెడ్ పద్ధతిలో కాకుండా, రైతుల పూర్తి భాగస్వామ్యంతో చట్టబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అప్పుడే సహకార వ్యవస్థ బలోపేతమై రైతులకు నిజమైన న్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు