BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

మందమర్రి టోల్ ప్లాజా వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా.. తప్పిన పెద్ద ప్రమాదం

తెలంగాణ
/ మంచిర్యాల / మందమర్రి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
07 Jun, 2026 - 02:51 PM
194 వీక్షణలు

మంచిర్యాల: మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం సింగరేణి కేకే మైన్ ఓపెన్ కాస్ట్ టోల్ ప్లాజా వద్ద ఆదివారం తెల్లవారుజామున ఒక భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొత్తగూడెం నుండి బెల్లంపల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఉదయం 4 గంటల ప్రాంతంలో టోల్ ప్లాజా వద్దకు రాగానే ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో కేవలం ఒక్కడే ప్రయాణికుడు ఉండటంతో అతడు ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డాడు. బస్సులో ఎక్కువ మంది ప్రయాణికులు లేకపోవడంతో ఒక పెను ప్రమాదం తప్పినట్లయింది, దీంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

​ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కావడంతో, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు టోల్ ప్లాజా సిబ్బంది వెంటనే స్పందించి, రోడ్డుపై బోల్తా పడిన బస్సును పక్కకు తొలగించేందుకు చర్యలు చేపట్టారు. అయితే ఈ ప్రమాదం బస్సు అతివేగం వల్ల జరిగిందా లేక తెల్లవారుజామున డ్రైవర్ నిద్రలోకి జారుకోవడం వల్ల జరిగిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై సంబంధిత అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది