www.ntodaynews.com
మందమర్రిలో అమానుషం ఆరేళ్ల కూతురిపై తండ్రి పైశాచికం
తెలంగాణ
/
మంచిర్యాల
/
మందమర్రి
మందమర్రిలో అమానుషం: ఆరేళ్ల కూతురిపై తండ్రి పైశాచికం
మంచిర్యాల: జిల్లాలోని మందమర్రిలో కన్నకూతురిపై ఓ తండ్రి అమానుషంగా ప్రవర్తించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సతీష్ అనే వ్యక్తి తన ఆరేళ్ల కుమార్తె మాట వినడం లేదని, సరిగా చదవడం లేదని కోపంతో ఆమెను ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి విచక్షణారహితంగా చితకబాదాడు. ఆ చిన్నారి పెట్టిన కేకలు విన్న ఒక పశువుల కాపరి అక్కడికి చేరుకుని తండ్రిని నిలదీయగా, తన బిడ్డను తాను బెదిరించుకుంటున్నానంటూ సతీష్ పొగరుగా సమాధానమిచ్చాడు. అయితే పశువుల కాపరి గట్టిగా మందలించడంతో సతీష్ అక్కడి నుండి పరారవ్వగా, ఈ దారుణానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారి ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది