www.ntodaynews.com
మంగళగిరిలో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
మంగళగిరిలో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై పార్టీ జెండాను ఘనంగా ఆవిష్కరించారు.
అనంతరం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ పార్టీ స్థాపన లక్ష్యాలను గుర్తుచేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.