www.ntodaynews.com
మోదీ దేశాన్ని నాశనం చేస్తున్నారు: మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు
జాతీయం
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా బి.కె. హరిప్రసాద్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నిర్వహించిన మెగా కన్వెన్షన్లో పాల్గొన్న ఖర్గే మాట్లాడుతూ, మోదీ దేశాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు.
భారతదేశంలో మతం పేరుతో భారీ స్థాయిలో దోపిడీ జరుగుతోందని ఆయన విమర్శించారు. రామమందిర నిర్మాణం కోసం సేకరించిన నిధుల్లో రూ.5,000 కోట్లు దుర్వినియోగం అయినట్లు నివేదికలు వస్తున్నాయని ఆరోపించారు. రాముడి పేరుతో దోపిడీ కోసమే ఆలయాన్ని నిర్మించారని వ్యాఖ్యానించిన ఖర్గే, హుండీ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.