మొసలి పిల్లలు పంట పొలాల్లో… 20 కనిపించి కలకలం!
ఉమ్మడి మెదక్ జిల్లా, సదాశివపేట మండలం, మెలిగిరిపేట గ్రామ శివారులో సోమవారం విభిన్న సంఘటన చోటుచేసుకుంది. కొందరు రైతుల పంట పొలాల్లో 20 మొసలి పిల్లలు కనిపించడంతో పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది. పశువులను కాపాడేందుకు వెళ్ళిన పశువుల కాపర్లు మొసలి పిల్లలను చూసి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఫారెస్టు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మొసలి పిల్లలను పట్టుకొని, సమీప ప్రాంతంలో దాదాపు 60 మొసలి గుడ్లను గుర్తించారు.
తరువాత, ఈ మొసలి పిల్లలు, గుడ్లను సంగారెడ్డి సమీపంలోని మంజీరా అభయారణ్యంలోని మొసళ్ల సంరక్షణ కేంద్రానికి తరలించారు. రైతులు, గ్రామస్తులు, ముఖ్యంగా పంట పొలాల్లో ఇది కనిపించడం వలన ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు చెరువులు, మెలిగిరిపేట ప్రాజెక్టు నీటిలో పెద్ద మొత్తంలో మొసళ్లు ఉండే అవకాశం ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
PHANI KUMAR.