BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 23 January 2026, 02:03 am
Posted by : NTODAY NEWS OFFICIAL

కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు

తెలంగాణ
23 Jan, 2026 - 02:03 AM
335 వీక్షణలు
కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు NTODAY NEWS: గొల్లపల్లి మండలం న్యూస్ రిపోర్టర్ రాంనూర్ గ్రామ సర్పంచ్ సహా పలువురు నేతలకు కండువా కప్పిన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బీఆర్ఎస్‌కు షాక్: కాంగ్రెస్‌లో చేరిన రాంనూర్ సర్పంచ్, కీలక నేతలు రాంనూర్, వెల్గటూర్ మండల పరిధిలోని రాంనూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. గురువారం రాంనూర్ గ్రామ సర్పంచ్ అయిత తిరుపతి ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేరికలైన నేతలకు పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. సర్పంచ్ తిరుపతితో పాటు ఇమ్మడిశెట్టి మొగిలి, రుద్రరామయ్య, రామరాజు, కండ్లే వెంకట నర్స్, కండ్లే శేఖర్ తదితరులు కాంగ్రెస్‌లో చేరారు. బీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాదాసు రవి కూడా కాంగ్రెస్‌లో చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నేతలు ఈ చేరికల కార్యక్రమంలో ఉమ్మడి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తాటిపర్తి శైలేందర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ గోపిక జితేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ గొల్ల తిరుపతి, మాజీ ఎంపీటీసీ మంజుల పాల్గొన్నారు. అలాగే రాంపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బిడారి భూమయ్య, ముత్తునూర్ సర్పంచ్ కె. పోచమల్లు, సీనియర్ నాయకులు మురళి గౌడ్, శ్రీకాంత్ రావు, నరేష్ గౌడ్, సందీప్ రెడ్డి మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. — కె. దుర్గయ్య, సోషల్ మీడియా కన్వీనర్ #CongressParty #PartyJoining #BRSShock #PoliticalNews #TelanganaPolitics #Ramnur #Velgatur #AdluriLaxmanKumar #GrassrootsPolitics #LocalLeadership Follow us on Website Facebook Instagram YouTube